ఈ న్యూ ఇయర్‌కి మన స్టార్ హీరోలు సెలబ్రెషన్స్ ఎక్కడంటే

ఈ న్యూ ఇయర్‌కి మన స్టార్ హీరోలు సెలబ్రెషన్స్ ఎక్కడంటే
x
Highlights

కొందరూ షూటింగ్ ముంగిచుకొని విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరంలో కలిసిన ఇక్కడే జరుపుకోనున్నారు. మరి కొందరూ సినిమా షూటింగ్ ముంగిచుకొని విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ తర్వాత ఎప్పటిలాగే కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావించారు. ఏ సినిమా చేసిన వర్క్‌ మూడ్‌లో ఉంటే సూపర్ స్టార్ హాలిడే మూడ్‌లోకి వెళ్లారు. అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్ అయింది. సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేశ్ తన పాత్రకు డబ్బింగ్ చేప్పేసి రిలీఫ్ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. వారం రోజులపాటు హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటారని తెలుస్తోంది. వారం రోజుల అనంతరం తిరగి వచ్చి చిత్ర ప్రమోషన్స్ లో బిజీ కానున్నారు.

మహేశ్‌బాబు సరసన హీరోయిన్ గా రష్మికా మందన్నా నటిస్తుంది. ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో విజశాంతి కీలక పోషించారు. జనవరి 5న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక జరగనుంది. దిల్‌రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు కలిసి నిర్మించిన ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి సంబర్భంగా విడుదల కానుంది.

ఇక టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ హైదరాబాద్ లో జరుపుకోనున్నారు. తన మీత్రులతో కలిసి ఈ ఎంజయ్ చేయనున్నారు. బాహుబలి తర్వాత సోహో చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. సాహో చిత్రంలో తెలుగులో నిరాశపరిచినప్పటికి బాలీవుడ్ లో మంచి కలెక్షన్ల రాబట్టింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చెయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది.

టాలీవుడ్ స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల..వైకుంఠపురములో..' .ఈ చిత్రంలలో పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది.యువ కథానాయకుడు సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌, జయరామ్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెండు వారాల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా నిర్వహించే పనిలో చిత్ర యూనిట్ బీజీగా ఉంది. అయితే ఈ సినిమా షూటీంగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. దీంతో అల్లు అర్జున్ రిలాక్స్ మూడ్ వెళ్లారు. ఇప్పటి వరకు సినిమాతో బీజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ నూతన సంవత్సరాన్ని భార్య స్నేహా రెడ్డి పిల్లలు అయాన్, అర్హ తో కలిసి జరుపుకోనున్నారు. విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఇప్పటి వరకు బీజీగా ఉన్నారు. ఇటీవలే ఔట్ డోర్ లోకేషన్లో షూటింగ్ జరిగింది. జూన్ 30లోగా సినిమాను రిలీజ్ చేయాలని జక్కన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. జక్కన్న అంటే ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బీజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తున్నారు, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. దీంతో ఈ సారి న్యూఇయర్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోనే జరుపుకుంటారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories