శభాష్ ప్రణీత: కరోనా వైరస్ పోరాటానికి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన హీరోయిన్

శభాష్ ప్రణీత: కరోనా వైరస్ పోరాటానికి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన హీరోయిన్
x
Pranitha Subhash (File Photo)
Highlights

కరోనాతో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.

కరోనాతో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరుతున్నాయి.. ఇక ప్రభుత్వానికి సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు ముందుకు వచ్చే ఆర్థిక సహాయం చేస్తుంటే... మరికొందరు వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాత్తతను చాటుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లుఅర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చారు.

అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో విరాళాలు ప్రకటించిన వారిలో కేవలం నటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే ఉన్నారు. నటీమణులు లేకపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో నీతులు చెప్పడమే తప్ప రూపాయి సహాయం చేసింది లేదు. ఈ నేపథ్యంలో కన్నడ భామ ప్రణీత తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చి మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఇలాంటి సినిమాలు లేనప్పటికీ సహాయం చేయడానికి ముందుకు రావడం ఇక్కడ గర్వించదగ్గ విషయం... పూట గడవని వారికి, రోజువారీ కూలీలకు వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 2000 చొప్పున 50 కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా అందిస్తున్నాననీ ప్రణీత పేర్కొంది. కనీసం ప్రణీతని చూసి అయిన మరికొందరు హీరోయిన్లు ముందుకు వస్తారో లేదో అన్నది చూడాలి మరి. ఇక కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో ఇప్పటికే 20,000మంది చనిపోగా అయిదు లక్షల మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్ లో 850 పైగా కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories