చిరు, నాగ్, వెంకీలతో దర్శకేంద్రుడి డ్రీం ప్రాజెక్ట్!

చిరు, నాగ్, వెంకీలతో దర్శకేంద్రుడి డ్రీం ప్రాజెక్ట్!
x
Ragavendra Rao (File Photo)
Highlights

80,90 లలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి! ఒక పక్కా సోలో హీరోలుగా సినిమాలు చేసుకుంటూనే మరోపక్కా మల్టీస్టారర్ సినిమాలు చేసేవాళ్ళు అప్పటితరం...

80,90 లలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి! ఒక పక్కా సోలో హీరోలుగా సినిమాలు చేసుకుంటూనే మరోపక్కా మల్టీస్టారర్ సినిమాలు చేసేవాళ్ళు అప్పటితరం హీరోలు.. కానీ రానురాను మల్టీస్టారర్ సినిమాలు కనుమరుగు అయ్యాయి. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు, వెంకటేష్ కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలకి బీజం పడింది. ఈ సినిమా తర్వాత మసాలా, గోపాల గోపాలా, తడాఖా, దేవదాసు మొదలగు చిత్రాలు తెరకేక్కాయి..

ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా RRR అనే సినిమా తెరకేక్కుతుంది. ఇక ఇది ఇలా ఉంటే మరో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని టాలీవుడ్ లో చర్చ మొదలవుతుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కలిసి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్రివేణి సంగ‌మం అనే చిత్రాన్ని చేయాల‌ని అనుకుంటున్నారట.. వాస్తవానికి ఈ సినిమాని రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా తీయాలని అనుకున్నారట.. కానీ పలు కారణాలతో ఈ సినిమా పట్టాలేక్కలేదు.

ఈ సినిమా స్థానంలో రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి గంగోత్రి అనే సినిమాని తెరకెక్కించారు. అయితే రాఘవేంద్రరావు స్క్రిప్ట్ పైన ఉన్న నమ్మకంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు రూపొందించాల‌ని రాఘేంద్రర‌రావు భావిస్తున్నార‌ట‌. త్వరలో దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్ కూడా రానుందని తెలుస్తోంది. చూడాలి మరి. ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, నాగార్జున వైల్డ్ డాగ్, వెంకటేష్ నారప్ప చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories