గబ్బా టెస్టు.. సినీ ప్రముఖుల అభినందనలు

గబ్బా టెస్టు.. సినీ ప్రముఖుల అభినందనలు
x

సినీ ప్రముఖుల అభినందనలు

Highlights

బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత్‌ విజయం సాధించింది.

బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత్‌ విజయం సాధించింది. 2-1తో సిరీస్ కైవసం చేసుకొని సత్తా చాటిన టీమ్‌ఇండియాకు పలువురు సినీతారలు అభినందనలు చెప్పారు. అందులో ముఖ్యంగా మంచు విష్ణు గురించి చెప్పాలి. భారత్‌ సిరీస్ కైవసం చేసుకుంటందని మంచు విష్ణు ముందే ఊహించాడు. టీమ్‌ ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని, ఈ టెస్టు మ్యాచ్‌ అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తుందని ఓ ట్వీట్‌ చేశాడు. తర్వాత మరో ట్విట్ చేశాడు.'మొత్తానికి మనం సాధించాం. అద్భుతమైన విజయం..' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 36ఆలౌట్‌ నుంచి 2-1సిరీస్‌ విజయం వరకూ.. యువప్రతిభ మెరిసింది.. ఐక్యత సాక్షాత్కరించింది.. చరిత్ర తిరిగి రాయబడింది RRR టీమ్ ట్వీట్ చేసింది. గబ్బాను జయించారు. సిరీస్‌ను 2-1తో గెలిచిన చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేది. చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గర్వంగా ఉంది' మహేశ్‌బాబు పేర్కొన్నారు. మ్యాచ్‌లో భారత్‌ అద్భుతమైన విజయం సాధించింది. కుర్రాళ్లు బాగా ఆడారు. గర్వంగా ఉందని విక్టరీ వెంకటేశ్‌ ట్వీట్ చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories