పెళ్లి వార్తలపైన స్పందించిన కీర్తి సురేష్

పెళ్లి వార్తలపైన స్పందించిన కీర్తి సురేష్
x
Keerthy Suresh (File Photo)
Highlights

ఒకప్పటి నటి మేనక కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది కీర్తి సురేష్.. ఇక తెలుగులో రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో...

ఒకప్పటి నటి మేనక కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది కీర్తి సురేష్.. ఇక తెలుగులో రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలందుకుంది. ఈ సినిమాకి గాను ఆమెకు జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్ గా మెరిసింది.

ఇదిలా ఉంటే ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.. కీర్తి సురేష్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఓ వరుడుని వేతకరని అతను ప్రముఖ బీజేపి నాయకుడీ కుమారుడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ స్పందిస్తూ... ఆ వార్తలను ఖండించింది వచ్చే ఏడాది వరకు సినిమాలకి కాల్షీట్స్ ఇచ్చానని పెళ్లి ఎలా జరుగుతుందని దయచేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరింది.

ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.. తెలుగులో హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాతో పాటు మిస్ ఇండియా అనే తెలుగు చిత్రంలో కీర్తి నటిస్తుంది. ఇక త‌మిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాల‌లో న‌టిస్తుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories