మళ్లీ ధియేటర్లు మూతకు రంగం సిద్దం

మళ్లీ ధియేటర్లు మూతకు రంగం సిద్దం
x

థియేటర్స్ ఫైల్ ఫోటో 

Highlights

*సినిమా ధియటర్లలో 100 % ఆక్యూపెన్సీకి గ్రీన్ సిగ్నల్ *పర్సంటేజ్ విధానంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ నడుమ బేదాభిప్రాయాలు

సినిమా ధియటర్లలో 100 శాతం ఆక్యూ పెన్సీ తో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.అయితే మరో వైపు ధియేటర్లు మళ్లీ మూత కు రంగం సిద్దం అవుతుంది. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిట‌ర్స్ అయింది టాలీవుడ్ పరిస్థితి.

100 శాతం ఆక్యుపెన్సీ తో ధియేటర్లకు పర్మిషన్ వచ్చిన, నిర్మాతలు, ఎగ్జిబీటర్ల మధ్య అభిప్రాయ బేధాల వల్ల సినిమా ధియేటర్లు మళ్ళీ మూత పడబోతున్నాయంటున్నారు సినీ ప్రముఖులు. మ‌ల్టీప్లెక్స్‌కి ఇస్తున్నట్టు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లకూ ప‌ర్సంటేజీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఎగ్జిబీటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు దీనికి ఒప్పుకోవటం లేదు.

నిర్మాతలు తమ సినిమాలను ధియేటర్లో విడుదల చేసిన వారం రోజుల్లోనే ఓటీటీల్లో రిలీజ్ లు చేస్తుండటంతో తమకు భారీ నష్టం వస్తుందని బాధపడుతున్నారు. దీని పై కూడ నిర్మాతలు వెనక్కి తగ్గటం లేదు. రిలీజ్ అయిన 6 వారాల తర్వాత ఓటీటీల్లో రిలీజ్ చేసుకోమని చెబుతున్న నిర్మాతలు వినటం లేదంటున్నారు. దీని వల్ల థియేట‌రల్ మూసుకోవాలసి వస్తుందంటున్నారు. త‌మ సమస్య పరిష్కరించని పక్షంలో థియేట‌ర్లను మ‌ళ్లీ మూసేస్తామ‌ని ఎగ్జిబిట‌ర్లు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories