Manchu Manoj పక్కన హీరోయిన్ గా టీవీ యాంకర్

Manchu Manoj పక్కన హీరోయిన్ గా టీవీ యాంకర్
x
Highlights

మూడేళ్ళ తరవాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాను చేసేందుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే.. తన సొంతంగా స్థాపించిన ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై తన కొత్తత సినిమాని నిర్మిస్తున్నాడు మనోజ్.

మూడేళ్ళ తరవాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాను చేసేందుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే.. తన సొంతంగా స్థాపించిన ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై తన కొత్తత సినిమాని నిర్మిస్తున్నాడు మనోజ్.. ఈ సినిమాకి . 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్‌ ఫిక్స్ చేస్తూ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పాన్ ఇండియా మూవీగీ తెరకెక్కుతున్న ఈ సినిమాకి తన తల్లి మంచు నిర్మలాదేవితో కలిసి మనోజ్ నిర్మాతగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టీవీ యాంకర్. నటి ప్రియా భవానీ శంకర్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కథ డిమాండ్ మేరకు కొత్త అమ్మాయి అయితేనే సెట్ అవుతుందని అనుకోని ప్రియా భవానీ ఎంపిక చేసినట్టుగా సమాచారం,, మొదటగా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవాని ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా మారింది. అనంతరం 2017లో హీరోయిన్ గా మారింది. మేయాదమాన్‌ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా నటించి అందరి చేత మంచి నటి అని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2లో కూడా అవకాశాన్ని సంపాదించుకుంది.

ఈ సినిమాను మార్చి 6న లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓ కొత్త కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా మనోజ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories