బాలయ్య సినిమాకి నో చెప్పిన తమన్నా?

బాలయ్య సినిమాకి నో చెప్పిన తమన్నా?
x
Highlights

గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలతో నిరాశపరిచాడు బాలకృష్ణ.. ఈ సంవత్సరం గట్టిగా హిట్టు కొట్టేందుకు సిద్దం అయ్యాడు.

గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలతో నిరాశపరిచాడు బాలకృష్ణ.. ఈ సంవత్సరం గట్టిగా హిట్టు కొట్టేందుకు సిద్దం అయ్యాడు. అందులో భాగంగానే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు. రూలర్ షూటింగ్ లో ఉన్నప్పుడే బోయపాటితో సినిమాని అనౌన్స్ చేశాడు బాలయ్య. గతంలో బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందించాయి.

సింహ, లెజెండ్ సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే బాలయ్య సరసన పలనా హీరోయిన్ నటించబోతుందని రకరకాల వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే బాలీవుడ్ బ్యుటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ నేను ఆ సినిమా చేయడం లేదని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇక ఆ తర్వాత తమన్నా పేరు వినిపించింది. తమన్నా ఈ సినిమాని చేసేందుకు ఆసక్తి చూపించలేదని దీనితో కథ క్యాథరిన్ వరకు వెళ్లిందని టాక్ .. దీనితో ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ ఫైనల్ అయిందని తెలుస్తోంది.. కానీ చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో క్యాథరిన్ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా జయజానికి నాయకా సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించింది ఈ భామ.. అయితే ఇందులో ఆమె ఓ ఐపీయస్ పాత్రలో కనిపించనుందని టాక్..

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకి వేదికని ఫిక్స్ చేసారని తెలుస్తుంది. మరో పాత్రకి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ని తీసుకున్నారని సమాచారం. పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories