టబు రెమ్యూనిరేషన్ చూసి షాక్ .. అనసూయ మాత్రం తక్కువకే ఒప్పుకుంది?

టబు రెమ్యూనిరేషన్ చూసి షాక్ .. అనసూయ మాత్రం తక్కువకే ఒప్పుకుంది?
x
Tabu Anasuya
Highlights

సినిమా అవకాశాలు కొన్ని అనుకోకుండా వస్తుంటాయి. ఆ పాత్రలు చేయకపోతే మంచి పాత్ర మిస్సయం అనే భావన కలుగుతుంది.

సినిమా అవకాశాలు కొన్ని అనుకోకుండా వస్తుంటాయి. ఆ పాత్రలు చేయకపోతే మంచి పాత్ర మిస్సయం అనే భావన కలుగుతుంది. అయితే అనసూయ మాత్రం పాత్ర ఏదైనా వచ్చిన ఆఫర్‌ని చక్కగా ఉపయోగించుకుంది. రంగస్థలం సినిమా త‌ర్వాత అనసూయ జాత‌కం మారిపోతుంది. ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల‌కు గుర్తుండిపోయింది. అంతకుముందు క్షణం సినిమాలో విల‌న్ పాత్రలో అదరగొట్టింది. యాత్రలో కూడా పాత్ర చిన్నదే అయినా ఆ సీన్ గుర్తుండిపోయేలా న‌టించింది. ఆ సీన్‌తో తనలో ఎంత మంచి న‌టి దాగి ఉందో తెలియజేసింది. అందాల ఆర‌బోత‌కు మాత్రమే కాదు నటిగా రాణిస్తానని తెలియజేస్తునే ఉంది.

తాజాగా ఒక ఆఫర్ అనసూయను వెతుకుతూ వచ్చింది. సీనియర్ నటి కాదని ఆఫర్ రావడంతో దానికి ఆమె ఓకే చెప్పేసింది. టాలీవుడ్ హీరో నితిన్ 'అంధధూన్' అనే హిందీ మూవీ రీమేక్‌లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయుష్మాన్ ఖురానా.. నటించిన 'అంధధూన్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాధికా ఆప్టే, సీనియర్ నటి టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ కానుంది.

దీనిలోని ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ టబుని సంప్రదించింది. కానీ టబు ఈ చిత్రంలో నటించేందుకు భారీ రెమ్యూనిరేషన్ అడిగిందని సమాచారం. ఎందుకంటే సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో.. మూవీ సూపర్ హిట్ కావడంతో టబు పారితోషకం పెంచారట. అల వైకుంఠపురములో.. సినిమాలో అల్లుఅర్జున్ తల్లి పాత్రలో టబు నటించిన సంగతి తెలిసిందే. దాంతో టబు ఇన్నింగ్స్ ప్రారంభించినట్టయింది. టబు అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కవగా ఉండడంతో సినిమా యూనిట్ అనసూయను సంద్రిచారట తక్కువ పారితోషకానికి ఒప్పుకుంది. ఈ సినిమా కోసం కొన్ని టీవీ షోలను పక్కప పెట్టినట్లు టాక్. టుబు కోటీ రూపాయలు డిమాండ్ చేసిందని, అనసూయకు పదిలక్షలకు ఓకే చెప్పినట్లు తెసుస్తోంది.

ఈ నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 'ఎక్సప్రెస్ రాజా', 'వేంకటాద్రి ఎక్సప్రెస్', 'కృష్ణార్జున యుద్ధం' సినిమాల రచయిత, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. 'ఠాగూర్' మధు, సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో నితిన్ వివాహం తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈసినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు.

కాగా.. నితిన్ చాలా రోజుల తరువాత 'భీష్మ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories