తాప్సి ఇంట్లో విషాదం

తాప్సి ఇంట్లో విషాదం
x
Highlights

టాలీవుడ్ హీరోయిన్ తాప్సి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

టాలీవుడ్ హీరోయిన్ తాప్సి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.తాప్సీ బామ్మ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తాప్సి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ విషయాన్ని తాప్సి పోస్ట్‌ చేశారు. 'ముందు తరంలోని చివరి వ్యక్తి మమ్మల్ని వదిలివెళ్లిపోయి. శూన్యాన్ని మిగిల్చింది. ఈ లోటు జీవితాంతం ఇలానే ఉంటుందని, బిజి (తాప్సి తన బామ్మను ఇలా పిలుస్తారట) అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అభిషేక్‌ బచ్చన్, టిస్కా చోప్రా, నిధి సింగ్‌, పావైల్‌ గులాటీ తదితరులు తాప్సికి సానుభూతి తెలిపారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాప్సి, ఆమె సోదరి షగుణ్‌తో కలిసి ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌లో తల్లిదండ్రులకు దూరంగా ఉండటం గురించి తాప్సి ఇటీవల మాట్లాడుతూ.. 'అమ్మానాన్న ఉంటున్న ప్రాంతానికి, రెడ్‌జోన్‌కు చాలా దూరం ఉంది. వారికి 60 ఏళ్లు దాటాయి.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. నాన్న విశ్రాంత ఉద్యోగి, అమ్మ గృహిణి. కాబట్టి బయటికి వెళ్లాల్సిన పని లేదు. నిత్యావసరాలకు, వాకింగ్‌కు మాత్రమే వెళ్తున్నారు. కాబట్టి ప్రమాదం లేదు' అని అన్నారు.

ఈ సందర్భంగా కూడా అభిమానులు బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, తాప్సి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెకు తట్టుకునే శక్తి కుటుంబ సభ్యులకు దేవుడు ఇవ్వాలని అభిమానులు పేర్కొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories