డౌట్స్ తుడిచెయ్.. స్ర్పైట్ తెరిచెయ్ అంటున్న హీరో సుశాంత్...

డౌట్స్ తుడిచెయ్.. స్ర్పైట్ తెరిచెయ్ అంటున్న హీరో సుశాంత్...
x
Sushanth(File photo)
Highlights

అక్కినేని మూడోతరం కథానాయకుడిలో హీరో సుశాంత్ ఒకరు.. 2008లో వచ్చిన కాళిదాసు సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన సుశాంత్

అక్కినేని మూడోతరం కథానాయకుడిలో హీరో సుశాంత్ ఒకరు.. 2008లో వచ్చిన కాళిదాసు సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన సుశాంత్ఆ తర్వాత కరెంట్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత చేసిన ఎ సినిమా కూడా హిట్ కాకపోవడంతో కథను ఎంచుకునే పనిలో పడి 2018లో వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు. ఇక హీరో ఆల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఓ కీలక పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా ఘన విజయం అందుకుంది.

ప్రస్తుతం సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఎస్‌. దర్శన్‌ అనే నూతన దర్శకుడు వెండితెరకి పరిచయం అవుతున్నాడు..మీనాక్షి చౌదరి కథానాయికగా పరిచయమవుతున్నది. ఏఐ స్టూడియోస్‌, శాస్ర్తా మూవీస్‌ పతాకాలపై రవిశంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌ కాన్సెప్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక సుశాంత్ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కూల్ డ్రింక్ అయిన 'స్ర్పైట్'తో యాడ్స్ లోకి అడుగుపెట్టాడు. " స్ర్పైట్ ఇస్తే తనే ఛాన్స్ తీసుకోనని నీతో డాన్స్ చేస్తాడు. ఇవ్వకపోతే ఇంకోకారు రొమాన్స్ చేస్తారు. అంటూ డైలాగ్ తో అదరగొట్టాడు. ఫోకస్ పోతే ఫూల్ అయినట్టే ఎండాకాలంలో డౌట్స్ తుడిచెయ్.. స్ర్పైట్ తెరిచెయ్ అన్న డైలాగ్ యాడ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక 'స్ర్పైట్'కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగులో నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతకు ముందు నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి సంయుక్తంగా చేశారు. ఇప్పుడు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. ఇక ఈ సమ్మర్ లో వచ్చే దాహం తిప్పలను తీర్చేందుకు సుశాంత్ సిద్దం అయిపోయాడన్న మాట..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories