సైరా దర్శకుడుతో సాహో హీరో ?

prabhas,surendar reddy
x
prabhas,surendar reddy
Highlights

సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తారని తెలుస్తుంది.

సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సురేందర్ రెడ్డి.. సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తన తదుపరి సినిమాలపై కథ చర్చలు ప్రారంభించాడు ఈ దర్శకుడు.. అయితే తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి తన తదుపరి సినిమాని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తారని తెలుస్తుంది.ఇప్పటికే కథ చర్చలు జరిగాయని వినికిడి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నారని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు... ఇందులో ప్రభాస్ కి జోడిగా పూజ హేగ్దే నటిస్తుంది. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. 2020 లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories