కాపురాలల్లో కరోనా చిచ్చు.. శ్రీముఖి 'బతుకు బలైపోయిన బండి' షో ద్వారా కలుపుతుంది

కాపురాలల్లో కరోనా చిచ్చు.. శ్రీముఖి బతుకు బలైపోయిన బండి షో ద్వారా కలుపుతుంది
x
Highlights

ప్రముఖ యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారు ఎవరూ వుండరు.

ప్రముఖ యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారు ఎవరూ వుండరు.అయితే , ఓ షో మొదలు పెట్టింది.భార్యాభర్తలు గొడవ పెట్టుకొని విడిపోతే.. శ్రీముఖి హోస్ట్ గా ఈ షో ద్వారా వారిని కలుపుతుంది. అదేంటి కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ దెబ్బకు టీవీలో సీరియల్స్, షోలు ఏవి రావడం లేదు అలాంటిది శ్రీముఖి చేస్తున్న కొత్త షో ఎంటి అనుకుంటున్నారా.. లాక్‌డౌన్ ప్రభావంతో ఇల్లలోనే ఉంటున్న జనానికి కాస్త వినోదాన్నిఅందించేందుకు ఈ స్ఫూఫ్ వీడియో శ్రీముఖి రూపొందించింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ హీరోయిన్ల హోస్టింగ్‌తో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని విడిపోతే.. వాళ్లను కలిపే టీవీ షోలు చాలానే ఉన్నాయి. ఇలాంటి షోలకు మంచి రేటింగ్ కూడా దక్కుతుంది. అయితే, సీరియస్ సంభాషణలతో కాకుండా తన మార్క్ కామెడీతో అలరించి మెప్పించింది. ఈ షోలో శ్రీముఖి హోస్ట్‌గా చేస్తే జబర్దస్త్ అవినాష్, యాంకర్ విష్ణుప్రియ భార్యభర్తలుగా కనిపించారు.

ఈ షో ద్వారా హాస్యం పండిస్తునే భార్యభర్తలిద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి గొడవలు రావని సందేశం ఇచ్చారు. ఈషోను శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే ఉండి షూట్ చేశారు. ఈ షోకి సంబందించిన వీడియోను శ్రీముఖి తన యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories