గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత
x
Highlights

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు.గత 50 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఎజిఎం ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో...

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు.గత 50 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఎజిఎం ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో యావత్ సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. కరోనా వైరస్ బారిన పడి ఆగస్ట్ 5న చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు ఆయన. ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాడని తనయుడు ఎస్పీ చరణ్ తెలిపాడు. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్న నేపథ్యంలో ఉన్నట్లుండి ఆయన మరణించారన్న వార్త సినీ లోకాన్ని కుదిపేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేశారు.

కాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories