Sarkaru Vaari Paata: మహేష్ అభిమానులకు దసరా కానుక ఇవ్వబోతున్న దర్శకనిర్మాతలు

Sarkaru Vaari Paata Movie Team Planning to Release First Song on Dussehra Festival
x

సర్కారు వారి పాట పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* దసరా సందర్భంగా మొట్టమొదటి పాటను విడుదల చేస్తున్న మహేష్ బాబు

Sarkaru Vaari Paata: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ దర్శక నిర్మాతలు మాత్రం సినిమాకి సంబంధించిన అప్డేట్లు విడుదల చేయడంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. దీంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే దర్శక నిర్మాతలు మహేష్ బాబు అభిమానులకు ఒక కానుకను ఇవ్వబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లోని మొట్టమొదటి పాటను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలకు థమన్ అందించిన పాటలు చాలానే చార్ట్ బస్టర్ లు అయ్యాయి. ఈ సినిమాకి కూడా థమన్ అదిరిపోయే సంగీతం ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కోలీవుడ్ నటుడు సముథిరఖని ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటరటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories