Sai Dharam Tej: "ఈమధ్య హీరోల మీద జోకులు ఎక్కువయ్యాయి,"

Sai Dharam Tej Reacts To The Trolls After The Accident
x

Sai Dharam Tej: "ఈమధ్య హీరోల మీద జోకులు ఎక్కువయ్యాయి,"

Highlights

Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయిన సాయి ధరంతేజ్

Sai Dharam Tej: మెగా మేనల్లుడు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి ధరంతేజ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. "పిల్ల నువ్వు లేని జీవితం", "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్", "సుప్రీమ్", "చిత్రలహరి" వంటి మంచి సినిమాలను కూడా అందుకున్న సాయి ధరమ్ తేజ్ 2021 సెప్టెంబర్ లో హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. బైక్ మీద వెళుతున్న సాయి తేజ్ కు తీవ్రంగా దెబ్బలు తగలడంతో అక్కడ స్థానికులు సాయి తేజ్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ దెబ్బల నుంచి కోలుకోవడానికి మెగా హీరోకి చాలా సమయం పట్టింది.

ఈ నేపథ్యంలో సాయి ధరంతేజ్ సినిమాలకి కూడా కొన్నాళ్ల పాటు దూరమయ్యారు. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న "రిపబ్లిక్" సినిమా విడుదలైంది కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్సిడెంట్ తర్వాత చికిత్స పొందుతున్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యారు సాయిధరమ్ తేజ్. "యాక్సిడెంట్ అయిన కొన్ని నెలల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేసి కొన్ని కామెంట్లు చదివాను.

ఇంకేంటి రిటైర్మెంటా? ఇంకా అంతా అయిపోయినట్టేగా? అని కామెంట్లు ఉన్నాయి. మొన్ననే కదరా యాక్సిడెంట్ అయింది రికవరీ అవ్వడానికి సమయం పడుతుంది అనిపించింది. ఈమధ్య ట్విట్టర్లో హీరోల మీద జోకులు సెటైర్లు బాగా వేస్తున్నారు," అని అన్నారు సాయి ధరమ్ తేజ్. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం సాయి ధరంతేజ్ "వినోదయ సితం" తెలుగు రీమేక్ మరియు "విరూపాక్ష" సినిమాలతో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories