తమన్ గురించి సాయి తేజ్ ఎమోషనల్ స్పీచ్

తమన్ గురించి సాయి తేజ్ ఎమోషనల్ స్పీచ్
x
sai dharam tej ( File photo)
Highlights

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజూ పండగే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. క్రిస్మస్...

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజూ పండగే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే నిన్న రాత్రి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది.

అయితే ఈ వేడుకలో హీరో సాయి తేజ్ మాట్లాడుతూ తమన్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. తమన్ నా బెస్ట్ ఫ్రెండ్.. మా ఇద్దరి మధ్య వచ్చిన సినిమాలు ప్లాప్ కావడంతో అతన్ని వదిలేయండి అని అన్నారు. కానీ ఫ్రెండ్ ని ఎలా వదిలేస్తాం. నేను కింద పడ్డప్పుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు పైకి లేచినప్పుడు కూడా నాతో ఉండాలి కదా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో నా ఫ్రెండ్ ఎలాగైతే ఉన్నాడో.. నేను అలాగే నా ఫ్రెండ్ కోసం ఉన్నాను. మా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్లాప్ అయ్యాయి కావచ్చు కానీ మ్యూజిక్ ఎప్పుడు ప్లాప్ కాలేదు. ఈ సినిమా పక్కా మ్యూజిక్ హిట్టు కొడుతుందని, ఫెయిల్ కాదనే నమ్మకం నాకు ఉందని చెప్పుకొచ్చారు హీరో సాయి.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక సాయి స్పీచ్ పై తమన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. " ఏం చెప్పాలి ?మాట రాని మౌనం తప్ప..డబ్బు,వ్యాపారం అంటూ స్నేహానికి రంగులు మార్చే ఈ రోజుల్లో, అచ్చమైన స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపం ,నా ప్రాణం "సాయి తేజ్"..నీ కోసం ఎప్పుడైనా,ఏదైనా సిద్ధం మిత్రమా..నీ మాటల్తో నాకు మాటలు లేకుండా చేసావ్..నా గుండెని తడి చేసావ్..లవ్ యూ మై డియర్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు తమన్..

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఇందులో సాయికి జోడిగా రాశీఖన్నా నటిస్తుంది. సత్యరాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందించగా, సిరివెన్నల సీతారామ శాస్త్రి పాటలని అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories