మా దేవుడి లుక్ ఎప్పుడొస్తుంది స్వామి.. ఆర్ఆర్ఆర్ పోస్టుపై ట్రోల్స్

మా దేవుడి లుక్ ఎప్పుడొస్తుంది స్వామి.. ఆర్ఆర్ఆర్ పోస్టుపై ట్రోల్స్
x
Highlights

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్".

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్". బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే

అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. గణతంత్ర దినోత్సవం రోజు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. చిత్రానికి సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు దీంతో అభిమానులకు నిరాశ ఎదురైంది. కాగా.. గణతంత్ర దినోత్సవం రోజున ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ సెట్ లో జెండా అవిష‌్కరించి ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. దీంతో అభిమానులకు చిరేత్తుకొచ్చింది. ఎందుకంటే జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఆ ఫోటోలో డైరెక్టర్ రాజమౌలి ఒక్కరే ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లేరు. దీంతో అభిమానులు ట్విటర్ వేదికగా ట్రోల్ చేస్తు్న్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ ఫోటోలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులైతే మా దేవుడు ఎన్టీఆర్ ఫోటో ఎక్కడ సామి అంటూ ట్విట్ చేస్తుంటే. మరి కొందరు అభిమానులు రామ్ చరణ్ ఎన్టీఆర్ లేకుండా బాగా మేనేజ్ చేశారు అంటు కామెంట్ పెడుతున్నారు.

ఇక ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఉన్న ఓ వీడియోతో లీక్‌ అయ్యింది. అంతేకాకుండా అడవిలో ఎన్టీఆర్‌ కేవలం కనిపిస్తున్న మరొక ఫోటో కూడా లీక్ అవడంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటున్నారు.

చిత్ర లీకుల నుంచి బయటపడేందుకు చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి జరగాల్సింది జరిగిపోతుంది. మరిదీనిపైన చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.. దాదాపుగా 10 బాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories