కుటుంబంతో క‌లిసి రామాయ‌ణం వీక్షిస్తున్న రీల్ రాముడు ఫోటో వైర‌ల్..

కుటుంబంతో క‌లిసి రామాయ‌ణం వీక్షిస్తున్న రీల్ రాముడు ఫోటో వైర‌ల్..
x
Highlights

దూరదర్శన్​ ఛానెల్​లో 1987 ప్రసారమైన 'రామాయణం సీరియ‌ల్ అప్పట్లో టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

దూరదర్శన్​ ఛానెల్​లో 1987 ప్రసారమైన 'రామాయణం సీరియ‌ల్ అప్పట్లో టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఈ ధారావాహికను పునఃప్రసారం చేయాలని దూరద‌ర్శ‌న్ ఛానెల్ గతవారం నిర్ణయించింది. అయితే ఆ సీరియ‌ల్ లో రాముని పాత్రలో నటించిన అరుణ్​ గోవిల్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి 'రామాయణం వీక్షిస్తున్నారు. ఆయ‌న రామాయ‌ణం ధారావాహిక వీక్షిస్తున్న ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ ధారవాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మళ్లీ 'రామాయణం'ను దూరదర్శన్‌లో ప్రసారం అవుతోంది. ఈ రామాయ‌ణం సిరీయ‌ల్ మ‌రో సారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సోమవారం ఈ సిరీస్‌ను అరుణ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాడు. సోషల్ మీడియాలో 'రామాయణం' హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అయ్యింది. ధారావాహిక చూస్తుంటే త‌మ బాల్యం గుర్తుకువ‌స్తోంద‌ని కొంద‌రూ కామెంట్స్ చేస్తున్నారు.

రామాయణంమార్చి 28 నుంచి ప్రసారం చేయబోతున్నామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. ప్ర‌జ‌ల కోరికమేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అలాగే తిరిగి రాత్రి 9 నుంచి 10 వరకు ప్రసారం అవుతోంద‌ని తెలిపారు.

ఈ బుల్లితెర‌ 'రామాయణం'లో సీత పాత్ర‌ధారిగా దీపిక చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లాహిరి నటించారు. వీరికీ మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు రామానంద్‌ సాగర్‌ 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. రాముని పాత్రలో నటించిన అరుణ్​ గోవిల్​ టీవీ వీక్షిస్తున్న ఫోటో నెటింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. రాముడు మ‌ళ్లి త‌న క‌థ‌ను తిల‌కిస్తున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories