Corona Effect: రైలు సీటు తుడిచిన హీరోయిన్

Corona Effect: రైలు సీటు తుడిచిన హీరోయిన్
x
Raveena Tandon
Highlights

రోనా వైరస్ ... ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి..

కరోనా వైరస్ ... ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి.. ఈ వ్యాధి వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే దీనిని నివారించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రభుత్వాలు మాత్రమే కాకుండా వైద్యులు చెబుతున్నారు. వ్యాధిని అరికట్టడంలో భాగంగా మొఖానికి మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండడం ఇలా వ్యక్తిగత శుభ్రతను పాటించడం వలన వైరస్ ని ఎక్కువగా నివారించవచ్చునని చేబుతున్నారు. సెలబ్రిటీల కూడా ఇదే విషయాన్ని చెబుతూ ప్రజలకు మరింత అవగాహన పెంచుతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ఓ రైల్లో ప్రయాణించింది. అందులో భాగంగా వ్యక్తిగత శుభ్రతలో భాగంగా ముఖానికి ఫేస్‌ మాస్కు ధరించి, .బెర్త్‌ను శానిటైజర్‌ వేసి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తర్వాత బాధ పడేకంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు మానుకుంటే చాలా మంచిది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. మిమల్ని మీరు కాపాడుకోండి. మీ చుట్టుపక్కల వారి క్షేమం కూడా చాలా ముఖ్యమని గమనించండి" అని అందులో పేర్కొంది. ఆమె చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక రవీనా టాండన్‌ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలే.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయం అయింది. ఆ తరవాత ఆకాశ వీధిలో, రధసారధి, పాండవులు పాండవులు తుమ్మెద మొదలగు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం 'కేజీఎఫ్‌-2'లో నటిస్తోంది.

ఇక కరోనా ఇప్పటికే 190 దేశాలకు పైగా వ్యాపించింది. ఈ వైరస్ వలన 11వేల మందికి పైగా తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇక భారత్‌లోనూ 270కి పైగా కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories