వాళ్లు ఇంట్లో ఉంటే.. నేను రెండు సినిమాలు చేశా టాలీవుడ్ డైరెక్టర్లపై వర్మ సెటైర్లు

వాళ్లు ఇంట్లో ఉంటే.. నేను రెండు సినిమాలు చేశా టాలీవుడ్ డైరెక్టర్లపై వర్మ సెటైర్లు
x
Ramgopal varma(file photo)
Highlights

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలా స్పందిస్తారో చెప్పడం కాస్త కష్టమే.

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలా స్పందిస్తారో చెప్పడం కాస్త కష్టమే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వర్మ ఆయన లాక్‌డౌన్ వేళ ఇళ్లకే పరిమితమైన హీరోలు, దర్శకులపై తనదైన శైలిలో సెటెర్లు వేసాడు. లాక్ డౌన్ సమయంలో కరోనపై పాట పడి కసితీర్చుకున్న వర్మ, ఆ తర్వాత కరోనా వైరస్ పేరుతో సినిమా ట్రైలర్ విడుదల చేసి సెన్సేషన్ సృష్టించాడు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హీరోలు, డైరెక్టర్ల ఇళ్లకే పరిమితమైతే రామ్ గోపాల్ వర్మ తాజాగా క్లైమాక్స్ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ను చూసి అమితాబ్ బచ్చన్ కూడా మెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఓ నెటిజన్ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ .. మీరు ఇంట్లో ఉండి ఏ పనులు చేయరు. గిన్నెలు తోమరు. బట్టలు ఉతకరు. అలాంటి మీ కోసం మేము ట్వీట్లు కూడా చేయమని అన్నాడు.

అయితే వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ఇంట్లో 'బీ ది రియల్ మేన్' ఛాలెంజ్‌లో భాగంగా ఇంట్లో పనులు చేసిన సంగతిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వాళ్లంత ఇంట్లో పనులతో బిజీగా ఉంటే, తాను మాత్రం ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కించానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ కరోనా లాక్‌డౌన్‌లో కూడా తను అనుకున్నది చేశాడు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories