రాజకీయ పార్టీ ప్రకటన విరమణ తర్వాత రజనీ ఇంటికి స్వామీజీ

రాజకీయ పార్టీ ప్రకటన విరమణ తర్వాత రజనీ ఇంటికి స్వామీజీ
x
Highlights

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నివాసనికి అనుకోని అతిథి వచ్చారు. రజనీ ఇంటికి ఓ స్వామీజీ వెళ్లి ఆయనను ఆశీర్వదించారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నివాసనికి అనుకోని అతిథి వచ్చారు. రజనీ ఇంటికి ఓ స్వామీజీ వెళ్లి ఆయనను ఆశీర్వదించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. రజనీకాంత్ ఇంటికి వెళ్లిన స్వామీజీ పేరు నమో నారాయణ స్వామీ. అపోలో వైద్యుల సూచన మేరకు రజనీకాంత్ పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నమో నారాయణస్వామి రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను రజనీకాంత్, లతారజనీకాంత్ ఎదురెళ్లిమరి‌ ఆహ్వానించారు. ఆయనతో రజనీకాంత్ సుమారు అరగంటకు పైగా సంభాషించారు. అనంతరం అక్కడి నుంచి స్వామీజీ వెళ‌్లారు. ఈ సందర్బంగా రజనీకాంత్ ఇంటి నుంచి బయటకు వచ్చి స్వామీజీకి వీడ్కోలు పలికారు. స్వామీజీ వచ్చి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ ను పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్‌ మండ్రం వర్గాలు పేర్కొన్నాయి. అయితే స్వామీజీ ఎప్పుడు వచ్చారనేది స్పష్టతలేదు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురికావడం.. కొద్ది రోజులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందడం, ఆ తర్వాత డిశ్చార్జి అయి చెన్నైకి వెళ్లడం జరిగింది. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయ పార్టీ పేరును ఇప్పట్లో ప్రకటించడంలేదని ట్విట్టర్‌లో తెలిపారు. .కుటుంబ సభ్యులు, వైద్యుల సలహా, సూచనల మేరకే రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు తెలిపారు. మూడేళ్ళుగా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్న మక్కల్‌ మండ్రం కార్యకర్తలు తనను క్షమించాలని కోరిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories