శ్రీలంకలో బాంబు పేలుళ్లు.. తృటిలో తప్పించుకున్న సినీనటి రాధిక

శ్రీలంకలో బాంబు పేలుళ్లు.. తృటిలో తప్పించుకున్న సినీనటి రాధిక
x
Highlights

శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 207 మంది ప్రజలు బలయ్యారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. 450 మంది దాకా చికిత్స పొందుతున్నారు. ఈ...

శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 207 మంది ప్రజలు బలయ్యారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. 450 మంది దాకా చికిత్స పొందుతున్నారు. ఈ దారుణమైన ఘటన శ్రీలంక చరిత్రలోనే మొదటిది. కాగా ఈ బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేశారు.

సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేసి వెళ్లారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్‌లో స్పందిస్తూ... ' పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా' అని ట్విట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories