ప్రభాస్ "రాధేశ్యామ్" కి సాడ్ ఎండింగ్ ఉంటుందా?

Radhe Shyam have a Sad Ending | Tollywood News
x

ప్రభాస్ "రాధేశ్యామ్" కి సాడ్ ఎండింగ్ ఉంటుందా?

Highlights

ప్రభాస్ "రాధేశ్యామ్" కి సాడ్ ఎండింగ్ ఉంటుందా?

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దర్శక నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజాగా ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన మరొక ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వత్రా చర్చ మొదలైంది. సినిమా కథ క్లైమాక్స్ సునామీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందనిఈ సినిమాకి సాడ్ ఎండింగ్ ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో ఒక షిప్ లో ఇరుక్కుపోయిన హీరోయిన్ పూజా హెగ్డే ను ప్రభాస్ ప్రకృతికి అడ్డుగా వెళ్లి కాపాడతాడని సమాచారం. ఇక క్లైమాక్స్ సన్నివేశం కోసం మాత్రమే చాలావరకు విజువల్ ఎఫెక్ట్స్ ని వాడినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories