పూజా హేగ్దేకి కరోనా కష్టాలు

పూజా హేగ్దేకి కరోనా కష్టాలు
x
Pooja Hegde's commitment, shooting with a mask
Highlights

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో పూజా హేగ్దే ఒకరు.. అరవింద సమేత, గద్దలకొండ గణేష్, మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలతో భారీ హిట్లు అందుకుంది ఈ భామ.. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తుంది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో పూజా హేగ్దే ఒకరు.. అరవింద సమేత, గద్దలకొండ గణేష్, మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలతో భారీ హిట్లు అందుకుంది ఈ భామ.. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో శేరవేగంగా జరుపుకుంటుంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ జార్జియాలో తక్కువ శాతం ఉండడంతో చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళింది. అయితే, అక్కడే ప్రభాస్ - పూజా హేగ్దేల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అక్కడికి చేరుకోగా, పూజా మాత్రం ఇండియా నుంచి బయలుదేరి టర్కీలోని ఇస్తాంబుల్ మీదుగా జార్జియా వెళ్లారు.

ఇక అక్కడ ఇస్తాంబుల్ న్యూ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను పూజా హేగ్దే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేశారు. ఇందులో పూజా మొఖానికి మాస్క్ కట్టుకొని చేతులకు గ్లోవ్స్ వేసుకుని కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండడంతో రక్షణ చర్యలో భాగంగా పూజా ఇలా దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, 'రాధేశ్యామ్' లేదా 'ఓ డియర్' అనే టైటిల్స్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది. పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కాజల్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని సమాచారం.. సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories