రెమ్యునరేషన్ పెంచేసిన పూజా... ఎంతంటే ?

రెమ్యునరేషన్ పెంచేసిన పూజా... ఎంతంటే ?
x
Highlights

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది పూజా హేగ్దే.. మొదట్లో సక్సెస్లు ఎక్కువగా రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ 'మొహంజోదారో'...

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది పూజా హేగ్దే.. మొదట్లో సక్సెస్లు ఎక్కువగా రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ 'మొహంజోదారో' సినిమా చేసింది కానీ క్రెడిట్ అయితే రాలేదు. ఇక అక్కడ ఇక్కడ ఛాన్స్ లు రావడం తగ్గాయి. కానీ తాజాగా వచ్చిన మహేష్ బాబు మహర్షి, ఎన్టీఆర్ అరవింద సమేత, వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేశ్' సినిమాలు పూజా కెరియర్ ని ఒక్కసారిగా మార్చేసాయి. టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పూజా కొనసాగుతుంది.

అయితే ఇప్పుడు వరుస సక్సెస్ రావడంతో పూజా రేంజ్ కూడా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే తన పారితోషికాన్ని పెంచుతూ రావడం విశేషం. ప్రభాస్ తో చేయబోయే సినిమాకి గాను పూజా రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ప్రస్తుతం పూజా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' చిత్రంలో నటిస్తుంది. ఆ తర్వాత అఖిల్ సినిమాలో నటిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories