ప్రస్తుతం టాలీవుడ్లో థ్రిల్లర్ కథలు ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి.
ప్రస్తుతం టాలీవుడ్లో థ్రిల్లర్ కథలు ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. అలాంటి ఓ విభిన్న సినిమాతో దర్శకుడు సుబ్బు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'రాహు' అనే టైటిల్ పెట్టి టీజర్, ట్రైలర్ లో వీక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో నటించిన వారంతా కొత్తవారు. అయినప్పటికీ సినిమా విడుదలకు ముందుగానే ఓ ప్రముఖ ఛానల్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.
రాహు సినిమాపై లేడీ అమితాబ్ విజయశాంతి ట్వీట్ చేశారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ''హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథతో చేసిన 'రాహు' సినిమా విజయవంతం కావాలని, మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మీ విజయశాంతి' అని 'రాహు' సినిమా ట్రైలర్ లింక్ను చేస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కిన సినిమాలకు విజయశాంతి ఎప్పుడూ ముందుంటారు. విజయశాంతి మద్దతు కావాలని రాహు సినిమా యూనిట్ అడగ్గానే ఆమె అంగీకరించారు.
రాహు సినిమాలోని ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ పాయింట్తో దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన థ్రిల్లర్ ఇది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రాహు' సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడల్లా బ్లైండ్ అవుతుంది, ఒత్తిడికి గురిఅవుతుంది. అలాంటి అమ్మాయి జీవితంలో రాహు వస్తే ఏమవుతుంది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం అని దర్శకుడు సుబ్బు చెప్పారు.
https://t.co/kTyyrjv6NL
— VijayashanthiOfficial (@vijayashanthi_m) February 26, 2020
హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథా వస్తువుతో చేసిన ఈ సినిమా 'రాహు' విజయవంతం కావాలని, మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.
మీ విజయశాంతి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire