నాగార్జున కు స్వయంగా ట్వీట్ చేసిన మోదీ

నాగార్జున కు స్వయంగా ట్వీట్ చేసిన మోదీ
x
Highlights

కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు 'బంగార్రాజు' సినిమా స్క్రిప్టు పనులపై ఒక కన్నేసి మరోవైపు రాహుల్...

కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు 'బంగార్రాజు' సినిమా స్క్రిప్టు పనులపై ఒక కన్నేసి మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు 2' పనులు కూడా చూసుకుంటున్నారు. అలాగే నాగచైతన్య, అఖిల్ సినిమాల స్క్రిప్టుల విషయంలో కూడా నాగ్ తన చేయి వేస్తారు అని తెలిసిందే. అయితే తాజాగా నాగ్ కు మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ట్వీట్ రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. చాలా అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల్లో ఫాలోయింగ్ ఉన్న మీరు ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని నా విజ్ఞప్తి" అని మోదీ స్వయంవ తన ట్వీట్లో నాగార్జునను మరియు మలయాళం సూపర్ స్టార్ మొహన్ లాల్ ను అభ్యర్థించడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలలో ముందుండే నాగార్జున ఈ ట్వీట్ కు ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories