మెగా హీరో పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు..!

Pawan Kalyan Fans Are Angry With Mega Hero
x

మెగా హీరో పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Highlights

* పవన్ కళ్యాణ్ సినిమా గురించి అడిగితే వినపడలేదు అంటూ తప్పించుకున్న మెగా హీరో

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తమిళ్ లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండగా తంబి రామయ్య పోషించిన పాత్రలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ తాజాగా ఒక ఈవెంట్లో సాయిధరమ్ తేజ్ ఈ సినిమా గురించి అడగగా జవాబు చెప్పకుండా తప్పించుకోవటం ఇప్పుడు అభిమానులను షాక్ కు గురిచేస్తుంది.

వివరాల్లోకి వెళితే, "వినరో భాగ్యము విష్ణుకథ" ట్రైలర్ లాంచ్ కు సాయి ధరమ్ తేజ్ గెస్టుగా వచ్చారు. స్టోరీలోని కాన్సెప్ట్ ప్రకారం కొత్త నెంబర్లకు ఫోన్లు చేశారు సాయి ధరమ్ తేజ్. ఆ సమయంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కి సాయి ధరమ్ తేజ్ కాల్ వెళ్ళింది. చాలా ఎక్సైట్ అయినా ఆ అభిమాని "వినోదయ సితం" గురించి అప్డేట్ ఇవ్వమని కోరారు. అక్కడ లైవ్ లో చూస్తున్న లక్షలాది ఆడియన్స్ కి స్పష్టంగా వినిపించినా కూడా సుప్రీం హీరో తనకు వినపడలేదు అంటూ రిపీట్ చేయటం అందరినీ షాక్ కి గురి చేసింది.

సమయం వచ్చినప్పుడు చెబుతాననో, లేదా వేరే సినిమా గురించి మాట్లాడడానికి ఇది మంచి సందర్భం కాదనో చెప్పి ఉంటే బాగుండేదని కానీ సాయి ధరంతేజ్ ఇలా ప్రవర్తించటం ఏమాత్రం బాగోలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఇప్పటికే ఓటీటీలో చాలామంది ప్రేక్షకులు చూసేసారు. ఇలాంటి సినిమాని రీమేక్ చేయడం ఎందుకని అభిమానులు ఎప్పటినుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ సాయి ధరంతేజ్ కూడా ఇలా రియాక్ట్ అవడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories