అల వైకుంఠపురములో : ఆ గెస్ట్ ఎవరో రివీల్‌ అయిపోయింది

అల వైకుంఠపురములో : ఆ గెస్ట్ ఎవరో రివీల్‌ అయిపోయింది
x
Highlights

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా సినిమాని జనవరి 12 న...

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా సినిమాని జనవరి 12 న విడుదల చేయనున్నారు . ఇప్పటికే సినిమా ప్రమోషన్ ల జోరు పెంచేసింది టీం. రెండు పాటలను విడుదల చేసి సినిమాకి చాలా పబ్లిసిటీని సంపాదించుకుంది . ఇక ఇప్పుడు చిల్డ్రన్స్‌ డే సందర్భంగా మరో సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ పాట ఓ మై గాడ్ డాడీ అంటూ సాగుతుంది.

ఈ పాటలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ .. తండ్రి మీద కంప్లయింట్‌ చేస్తున్నట్టుగా ఈ టిజర్ ని చిత్రీకరించారు. ఇందులో అల్లు అయాన్ మాత్రమే కాకుండా అయన ముద్దుల కూతురు అర్హ కూడా కనిపించింది. ఈ పాటకి కృష్ణ చైతన్య సాహిత్యం అందించగా రోల్ రిడా, రాహుల్‌ సిప్లిగంజ్‌, బ్రేజీ, రాహుల్ నంబియార్‌, రాబిట్‌ మాక్‌లు ఆలపించారు. నవంబర్ 22 న పూర్తి సాంగ్ ని బయటకు వదలనున్నారు.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇది మూడో సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే నటిస్తుంది. సుశాంత్, నవదీప్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories