మహేష్, బన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి జక్కన్న హీరోలు?

మహేష్, బన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి జక్కన్న హీరోలు?
x
Rajamouli
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో' .. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లలో జోరు పెంచారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా వస్తునట్టు ప్రచారం నడుస్తుంది.

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' అనే సినిమా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. దీనితో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఇటు అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ కి కూడా మంచి అనుభంధం ఉంది. ఇద్దరు మధ్య బావ అని పిలుచుకునేంత చనువు ఉంది. దీనితో అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాను ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచారని తెలుస్తుంది. దీనికి కూడా ఎన్టీఆర్ కూడా అంగీకరించినట్టు సమాచారం. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది

ఇక ఇది ఇలా ఉంటే సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఇలా ఒక హీరో సినిమాలను మరో హీరో వచ్చి ఎంకరేజ్ చేసుకోవడం వలన ఒక మంచి వాతావరణం జనరేట్ అవుతుందని సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్. ఆర్. ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ) లో నటిస్తున్నారు. దాదాపుగా డెబ్బై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30 న విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories