ఇండియన్ ఆర్మీని అవమాన పరిచారు.. సరిలేరు నీకెవ్వరు టీం పై నెటిజన్స్ ఫైర్

ఇండియన్ ఆర్మీని అవమాన పరిచారు.. సరిలేరు నీకెవ్వరు టీం పై నెటిజన్స్ ఫైర్
x
Sarileru neekevvaru ( File Photo)
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో మహేష్ బాబు ఇండియన్ ఆర్మీ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇక ఇది ఇలా ఉంటే భారత ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఓ పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాటను డిసెంబర్ 23 న సాయింత్రం 05; 04 గంటలకి రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా వదిలిన ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఆ పోస్టర్ లో మహేష్ బాబు వెనకాల ఓ వ్యక్తి గుబురు గడ్డంతో ఇండియన్ ఆర్మీ డ్రెస్‌లో ఉన్నాడు. దీంతో అసలు ఆర్మీలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? పోస్టర్ రిలీజ్ చేసేముందు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోరా? భారత ఆర్మీను సరిలేరు నీకెవ్వరు టీం అవమాన పరిచిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజేంద్రప్రసాద్, సంగీత, విజయశాంతి, రావు రమేష్ ప్రాధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు అనిల్ సుంకరలతో కలసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories