Nawabpet Devara: రాయలసీమ సంస్కృతికి అద్దం పట్టే 'నవాబుపేట దేవర'.. గ్రాండ్‌గా డాక్యుమెంటరీ ప్రీమియర్!

Nawabpet Devara: రాయలసీమ సంస్కృతికి అద్దం పట్టే నవాబుపేట దేవర.. గ్రాండ్‌గా డాక్యుమెంటరీ ప్రీమియర్!
x
Highlights

Nawabpet Devara: గతంలో 'పొద్దుటూరు దసరా' డాక్యుమెంటరీతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ, తాజాగా మరో అద్భుత దృశ్యకావ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Nawabpet Devara: గతంలో 'పొద్దుటూరు దసరా' డాక్యుమెంటరీతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ, తాజాగా మరో అద్భుత దృశ్యకావ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాయలసీమ ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా ఆయన రూపొందించిన 'నవాబుపేట దేవర' డాక్యుమెంటరీ ప్రీమియర్ షో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథిగా మహేశ్ విట్టా

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మహేశ్ విట్టా ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్యుమెంటరీని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "మా రాయలసీమలో దేవర పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఆ నేటివిటీని మురళీకృష్ణ తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. సీమ నేపథ్యంతో ఎందరో గొప్ప దర్శకులు వచ్చినా, మన కథలను మన వాళ్లే ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మురళీకృష్ణ త్వరలోనే ఒక పూర్తి స్థాయి సినిమాతో వెండితెరపై సత్తా చాటాలని కోరుకుంటున్నాను" అని ప్రశంసించారు.

టీమ్ కష్టం వృథా పోలేదు: చిత్ర యూనిట్

ప్రొడ్యూసర్ శివప్రసాద్: "దేవర పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ నిర్మించాం. దర్శకుడు మురళీ ఈ జాతర జరిగిన రెండు రోజులు నిద్రలేకుండా కష్టపడ్డారు. త్వరలోనే ఆయన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాం."

నిర్మాత పూజ కృష్ణ తుమ్మ: "నవాబుపేట డాక్యుమెంటరీ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మన సంప్రదాయంలో ఉన్న జంతుబలి ఆచారాన్ని కూడా ఇందులో సహజంగా చూపించారు."

సర్పంచ్ సుధాకర్ రెడ్డి: "మా ఊరి పండుగను ఊహించిన దానికంటే చాలా క్రియేటివ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు. మ్యూజిక్, సాంగ్స్ హైలైట్‌గా నిలిచాయి."

టెక్నికల్ హైలైట్స్: ఏఐ (AI) తో అమ్మవారి రూపం

దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ మాట్లాడుతూ.. "పొద్దుటూరు దసరా ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. కేవలం 32 గంటల్లో టీమ్ అంతా కలిసి ప్రాణం పోశారు. ముఖ్యంగా ఇందులో అమ్మవారిని AI (Artificial Intelligence) సాంకేతికతతో శివ, రాహుల్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆనంద్ సంగీతం, నాగేంద్ర సాహిత్యం ఈ డాక్యుమెంటరీకి ప్రాణం పోశాయి" అని తెలిపారు.

బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ త్వరలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories