నాగచైతన్య 20 సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరో తెలుసా?

నాగచైతన్య 20 సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరో తెలుసా?
x
naga chaitanya
Highlights

గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న దర్శకుడు పరశురామ్ కి వరుస అవకాశాలు వస్తాయని

గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న దర్శకుడు పరశురామ్ కి వరుస అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. అనుకున్నట్టుగానే మహేష్ బాబు, అల్లు అర్జున్ , అఖిల్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ వర్కౌట్ కాలేదు. తన కొత్త ప్రాజెక్ట్ కి అనౌన్స్ చేయడానికి పరుశురాం కి ఏకంగా ఏడాదిన్నర టైం పట్టింది.

తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నట వారసుడు నాగచైతన్యతో సినిమాని అనౌన్స్ చేశాడు పరుశురాం. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.తాజాగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని బయటకు వదిలింది. ఈ పోస్టర్ లో నాగచైతన్య- పరశురామ్ సహా 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట- గోపిచంద్ ఆచంట ఉన్నారు. నమో వేంకటేశ సినిమాతో తమ కెరియర్ ని మొదలు పెట్టిన 14 రీల్స్ ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాని చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్యతో సినిమా చేస్తుండడంతో సినిమాపైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక జోష్ సినిమాతో తన కెరీయర్ ని మొదలుపెట్టిన నాగచైతన్య ఇప్పటివరకు 18 సినిమాల్లో నటించాడు. తాజాగా వెంకీమామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతన్య. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ పక్కా తెలంగాణా కుర్రాడిగా కనిపిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నాడు. ఫిదా లాంటి మంచి హిట్టు తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక నిన్న ( శుక్రవారం) విడుదలైన వెంకీమామ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మామ అల్లుళ్ళ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటించాడు. రాశీఖన్నా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా తెరకెక్కగా, బాబీ దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories