క్రౌడ్ ఫండింగ్ సినిమా తో 'మహానటి' దర్శకుడు

Nag Ashwin
x
Nag Ashwin
Highlights

నిజానికి టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలవ్వడానికి ముఖ్య కారణం నాగ్ అశ్విన్ అని చెప్పుకోవచ్చు. 'మహానటి' సినిమా హిట్ అయిన తరువాతే చాలా మంది దర్శకులు బయోపిక్ ల మీద కన్నేశారు.

నిజానికి టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలవ్వడానికి ముఖ్య కారణం నాగ్ అశ్విన్ అని చెప్పుకోవచ్చు. 'మహానటి' సినిమా హిట్ అయిన తరువాతే చాలా మంది దర్శకులు బయోపిక్ ల మీద కన్నేశారు. అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర గా 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని బయోపిక్ లకు మార్గదర్శకంగా మారింది. 'మహానటి' సినిమా తరువాత ఎలాంటి సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఒక క్రౌడ్ ఫండింగ్ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు.

కొత్త దర్శకుడు విద్యాధర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒక సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'గామీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అక్టోబర్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. "ఈ సినిమాకు సంబంధించిన ప్రతి డీటైల్స్ ను చూసిన నాగ్ అశ్విన్ ఆశ్చర్య పోయి తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. "ఆగస్టులో నేను ఒక్క వీడియో ను చూశాను. మామూలుగా ఇలాంటి వీడియోలను మనం హాలీవుడ్ లో మాత్రమే చూస్తాం. కానీ అలాంటి వీడియోలు ఇండియన్ సినిమాలలో చూసి ఆశ్చర్యపోయాను. అందుకే ఆ చిత్ర బృందానికి మెసేజ్ చేశాను. ఈ చిత్రాన్ని కార్తిక్ నిర్మిస్తున్నారు.తెలుగులో ఇదొక కొత్త ప్రయోగం" అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి ఆ సినిమాకి సాయం కోసం నిధి సేకరణకు రెడీ అయ్యాడు నాగ్ అశ్విన్.

Show Full Article
Print Article
Next Story
More Stories