కబీర్ సింగ్ ఎఫెక్ట్ ; హత్య చేసాడు ... సందీప్ వంగ ఏమన్నాడంటే ..?

కబీర్ సింగ్ ఎఫెక్ట్ ; హత్య చేసాడు ... సందీప్ వంగ ఏమన్నాడంటే ..?
x
Highlights

విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి.. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి...

విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి.. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. దీనిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు సందీప్.. అక్కడ షాహిద్ కపూర్ కీయరా అద్వానీ నటించారు. అయితే ఈ సినిమాకి ప్రభావితం అయి ఉత్తర్ ప్రదేశ్ కి చెందినా టిక్ టాక్ స్టార్ అశ్వినీ కుమార్‌ హత్య చేసాడని పోలీసులు చెబుతున్నారు.

ఇక ఆసలు విషయానికి వస్తే ... టిక్‌టాక్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం అశ్వినీ కుమార్‌కు అలవాటు. అయితే ఓ వారం రోజుల కింద అతను తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గత కొద్దికాలంగా ఫ్లైట్‌ అటెండెంట్‌ నిఖితా శర్మను ప్రేమిస్తున్నాడు. కానీ రానున్న డిసెంబర్‌లో నిఖితకు మరొకరితో పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న అశ్వినీ కుమార్ తట్టుకోలేక ఆమెను చంపేసాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపైన పోలీసులు విచారణ చేపట్టగా అతని టిక్ టాక్ వీడియోల్లో ఎక్కువగా కబీర్ సింగ్ సినిమాకి సంబంధించిన డైలాగులు కనిపించాయి. ఆమె నాకు దక్కని పక్షంలో మరొకరికి దక్కకూడదని అర్థం వచ్చేలా కొన్ని డైలాగులు కనిపించాయి.

దీనితో అతడిపై కబీర్ సింగ్ సినిమా ప్రభావం ఎక్కువగా ఉందని దానితో ప్రియురాలును హత్య చేసి తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపైన చిత్ర దర్శకుడు సందీప్ వంగ స్పందించారు. " నా సినిమాలు ఇతరులను చంపమని ఎప్పుడు ప్రోత్సహించలేదని తెలిపాడు. అలా ప్రోత్సహించే అలవాటు కూడా తనకు లేదని చెప్పుకొచ్చాడు. నిఖితా శర్మకు జరిగిన అన్యాయం పట్ల చాలా బాధగా ఉంది.. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాని చెప్పాడు" సందీప్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories