బస్సులో 'భీష్మ' ... స్పందించిన కేటీఆర్

బస్సులో భీష్మ ... స్పందించిన కేటీఆర్
x
KTR(file photo)
Highlights

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో...

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం వారం రోజుల్లో యాభై కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే మంచి హిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని పైరసీకి గురైంది.

హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వెళుతున్న ఆర్టీసీ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ సినిమాని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు దీనిని ఫోటో తీసి చిత్రబృందానికి పంపించాడు. ఈ విషయంపైన దర్శకుడు వెంకీ కుడుముల తన ట్విట్టర్ నుండి పోస్ట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ గారిని ట్యాగ్ చేసాడు. అయితే దీనిపైన మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... ఈ విషయాన్ని తప్పకుండా రవాణా శాఖ మంత్రి 'పువ్వాడ అజయ్' గారి వద్దకు తీసుకెళ్తాను... ఈ పైరుసీని ఖచ్చితంగా అరికట్టాలి' అని ఆయన పోస్ట్ చేసారు.

ప్రస్తుతం భీష్మ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నితిన్ ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

ఇక ఈ శుక్రవారం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేయనుంది చిత్ర యూనిట్. వైజాగ్‌లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని సీతార ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాని చూసిన వరుణ్ తేజ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories