ఇటువంటి మృగాల మధ్యా మనం బ్రతుకుతుంది: చిరంజీవి

ఇటువంటి మృగాల మధ్యా మనం బ్రతుకుతుంది: చిరంజీవి
x
మెగాస్టార్ చిరంజీవి
Highlights

రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తాన్ని కదిలించింది వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన.

రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తాన్ని కదిలించింది వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన.. దీనిపైన మామలు ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ప్రియంకారెడ్డి హత్యకు కారుకులైన నలుగురుని బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి వీడియో రూపకంగా స్పందిచారు.

గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఇవ్వన్ని వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.

త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌లో 'హాక్ ఐ' యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత'' అని అందులో పేర్కొన్నారు చిరంజీవి..

ఇక ప్రియాంకా హత్యకు కారుకులైన నిందితుల శివ, నవీన్, అరీప్, చేన్నకేశులును చర్లపల్లి జైలుకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో నిందితులు నలుగురిని తరలించారు. అయితే నిందితులు జనాలకు కనిపించకుండా బస్సు మధ్యలో పడుకోబెట్టి తరలించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories