ఆచార్య నుంచి త్రిష తప్పుకోవడంపై చిరు క్లారిటీ!

ఆచార్య నుంచి త్రిష తప్పుకోవడంపై చిరు క్లారిటీ!
x
Chiranjeevi and Trisha (File Photo)
Highlights

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'..

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే..

అయితే సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. తన పాత్రకి తగ్గ ప్రాధాన్యతను తగ్గించారని అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ విషయాలపైన చిరంజీవి స్పందించారు. త్రిషకి చిత్ర యూనిట్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి రావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా చిరంజీవి వెల్లడించారు. ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదని చిరు అన్నారు.

త్రిష స్థానంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసింది చిత్రబృందం.. ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories