ఆద్య, సితారలతో మహేష్ సందడి.. కూతురు అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్
సరిలేరు నీకేవ్వరు సినిమా విడుదల ముందు తర్వాత తాను చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేకమని తెలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు నుంచి వసూళ్ల సునామి సృష్టిస్తోంది. కాగా.. ఈ నేపథ్యంలో నటుడు మహేష్ బాబు సినిమా యూనిట్ కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి సినిమాకు విజయోత్సవ సంబర్లాల్లో పాల్గొన్నారు. సరిలేరు నీకేవ్వరు సినిమా విడుదల ముందు తర్వాత తాను చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేకమని తెలిపారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి 'ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కూరుతు ఇద్దరు ఇందులో చేస్తున్నారు. వీరు సినిప్రముఖుల ఇంటర్వ్యూలు విభిన్న పోస్టుతో ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. ఈ ఇద్దరు పిల్లలు తమ ఏఆండ్ ఎస్ ద్వారా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న ఇంటర్వ్యూ చేశారు . అంతే కాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబును ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మహేశ్ బాబును పలు ప్రశ్నలు అడిగారు. ఆర్మీ జవానుగా నటించడం ఏలా ఉందని అడిన ప్రశ్నలు మహేష్ సమాదానం ఇచ్చారు. జవానుగా నటించడం గర్వంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా జనవరి 11 ఓ ప్రత్యేకమై రోజని తెలిపారు. ఆ తర్వాత మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరని అడిగారు. దీంతో మహేష్ నవ్వుతూ.. ప్రస్తుతానికి రష్మిక ఫేవరెట్ కోస్టార్ అని మహేష్ తెలిపారు. అంతే కాదు చిచ్చరపిడుగులు అడిన ప్రశ్నలకు మహేశ్ బాబు అదే స్టైల్లో జవాబు చెప్పారు.
కాగా.. దీనికి సంబంధించిన ఓ వీడియోను మహేశ్ తన ట్విటర్ లో షేర్ చేశారు. " చిన్నరులు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు మించిన సంతోషం నాకు ఏం ఉంటుంది. చిన్నారుల ఇద్దరికి నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి'' అని వీడియోను మహేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు.
జనవరి 11న విడుదైన చిత్రం విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించారు.
Being interviewed by my lil girls has been the best part of my promotions so far💞💞 Such a pleasure...what more can I ask for! Love their energy & style!!! ❤❤❤ Way to go Aadya and Sitara 🤗🤗 Love & blessings to both!https://t.co/Eb4n3ifmCB
— Mahesh Babu (@urstrulyMahesh) January 18, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire