ఎక్కువ నిడివితో రాబోతున్న "మహర్షి"

ఎక్కువ నిడివితో రాబోతున్న మహర్షి
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా "మహర్షి". దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు....

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా "మహర్షి". దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని మొదట ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళి ఏప్రిల్ 25 కి సినిమాకి పోస్ట్ పోన్ చేసారు. ఇక ఇప్పుడేమో సినిమాని ఏకంగా మే 9 కి పోస్ట్ పోన్ చేసాడు దిల్ రాజు. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే దిల్ రాజు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నిడివి చాలా పెద్దగానే ఉండబోతుంది అనే ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది అంట, సో ఇప్పుడు ఒక్క సీన్ కట్ అయిన కూడా ఆ ఎమోషన్ మిస్ అవుతుంది అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి భావిస్తున్నాడు. అందుకోసం సినిమాని నిడివి ఎక్కువైనా పర్లేదు అని చెప్పి అదే ఫ్లో ని కంటిన్యూ చేస్తున్నాడు వంశీ. అల్లరి నరేష్ పాత్ర హై లైట్ అవ్వనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.Mahesh Babu's 25th Film 'Maharshi' Gets a New Release Date After Delays In Post-Production

Show Full Article
Print Article
Next Story
More Stories