Mahesh Babu: దేవిని పక్కన పెట్టిన మహేష్ .. తమన్ తో నెక్స్ట్ మూవీ !

Mahesh Babu: దేవిని పక్కన పెట్టిన మహేష్ .. తమన్ తో నెక్స్ట్ మూవీ !
x
Highlights

ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాలలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు మంచి హిట్టు అయ్యాయి. ఇక మ్యూజిక్ పరంగా చూస్తే...

ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాలలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు మంచి హిట్టు అయ్యాయి. ఇక మ్యూజిక్ పరంగా చూస్తే సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే అల వైకుంఠపురములో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇందులోని పాటలు శ్రోతలను కట్టిపడేశాయి. ఒక్కో పాట ఒక్కో రికార్డును సృష్టిస్తూ వచ్చింది. అయితే మహేష్ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకి వరుసగా దేవినే సంగీతం ఇస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మహేష్ తన తదుపరి చిత్రానికి తమన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ నటించిన దూకుడు, బిజినెస్ మెన్ చిత్రాలకి తమన్ సంగీతం అందించాడు. అందులోని పాటలు మంచి హిట్టు అయ్యాయి. ముఖ్యంగా బిజినెస్ మెన్ చిత్రంలోని సారోస్తా రోస్తారా , బ్యాడ్ బాయ్స్ పాటలకి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఇప్పటికే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories