ఇది గమనించారా: 30 ఏళ్ల తర్వాత మహేష్, కళ్యాణ్ మరోసారి

ఇది గమనించారా: 30 ఏళ్ల తర్వాత మహేష్, కళ్యాణ్ మరోసారి
x
Highlights

ఈ సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదల చేశారు.

ఈ సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదల చేశారు. ఈ సినిమాలు మంచి విజయాన్నీ అందుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో ఓ స్పెషాలిటి ఉంది. మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ ఇద్దరు బాలనటులుగానే తమ సినీ కెరియర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత హీరోలుగా మారి సినిమాలు చేసి మంచి సినిమాలు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు.


అయితే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, విజయశాంతి హీరోయిన్ గా నటించిన కొడుకుదిద్దిన కాపురం సినిమాలో బాలనటుడుగా నటించాడు మహేష్ బాబు . ఈ సినిమా 1989 సెప్టెంబరు 21న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక అ తర్వాత విజయశాంతి - మహేష్ బాబు కలిసి నటించింది లేదు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో కలిసి నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకేవ్వరు' ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని బాక్స్ వద్ద దూసుకుపోతుంది.

ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన 'బాల గోపాలుడు' చిత్రంలో సుహాసిని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బాలనటుడుగా నటించాడు. ఈ సినిమా 1989 అక్టోబరు 13న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక అ తర్వాత సుహాసిని - కళ్యాణ్ రామ్ కలిసి నటించింది లేదు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 'ఎంత మంచివాడవురా' సినిమాలో కలిసి నటించారు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంట్ టాక్ ను సంపాదించుకొని దూసుకుపోతుంది.


ఇక కొడుకుదిద్దిన కాపురం, బాలగోపాలుడు సినిమాలు అప్పుడు 22 రోజుల తేడాతో విడుదల కాగా, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచివాడవురా సినిమాలు 4 రోజుల తేడాతో విడుదలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories