దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయలు విరాళం

దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయలు విరాళం
x
Daggubati Family (File Photo)
Highlights

కరోనా వైరస్ తో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.

కరోనా వైరస్ తో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరుతున్నాయి.. ఇక ప్రభుత్వానికి సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లుఅర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చారు.

తాజాగా ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వెంకటేష్‌, రానా, సురేష్ బాబు సంయుక్తంగా కోటీ రూపాయ‌ల విరాళాన్ని అందించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ విరాళాన్ని లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నిలేక ఇంటికే ప‌రిమిత‌మైన సినిమా వ‌ర్క‌ర్స్‌కి అలానే హెల్త్ వ‌ర్క‌ర్స్‌కి అందించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలో ఇప్పటికే 20,000మంది చనిపోగా అయిదు లక్షల మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక భారత్ లో 850 పైగా కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories