లెజెండ్స్‌ సరసన కాజల్.. ఆ ఘనత సాధించిన హీరోయిన్‌గా రికార్డ్

లెజెండ్స్‌ సరసన కాజల్.. ఆ ఘనత సాధించిన హీరోయిన్‌గా రికార్డ్
x
Highlights

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్రకథానాయక కాజల్‌కు అరుదైన ఘనత దక్కింది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్రకథానాయక కాజల్‌కు అరుదైన ఘనత దక్కింది. కాజల్ వైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో ప్రపంచంలో ప్రఖ్యాత నటీనటుల మైనపు విగ్రహాలన్ని నెలకొల్పుతారు. తాజాగా కాజల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు విగ్రహాలను కూడా గతంలో ఏర్పాటు చేశారు. తాజాగా కాజల్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కాజల్ హార్షం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విటర్ లో షేర్ చేసుంది. మైనపు విగ్రహా ప్రారంబోత్సవానికి తానే స్వయంగా హాజరవుతానని స్పష్టం చేసింది.

ఈ సందర్బంగా ట్విట్ చేసిన కాజల్ 2020 ఫిబ్రవరి 5న నా వైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అందుగాను సింగపూర్‌ వెళ్తాను, టుస్సాడ్స్‌లో నా విగ్రహాం ఏర్పాటు చేయడం గర్వంగా ఉంది. ఇది చాలా గొప్ప అనుభూతి అంటూ ట్వీట్ చేసింది. నా చిన్నతనంలో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంకు వెళ్లానని ఇప్పటికి నాకు గుర్తుంది. ఆ మ్యూజియంలో నేను ఇష్ట పడే వ్యక్తుల విగ్రహాలను చూశానని, ఇప్పుడు వారి సరసన నా విగ్రహం కూడా చేరటం గర్వంగా ఉందని కాజల్ పేర్కొంది‌.

నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నాని భావోద్వేగంతో ట్వీట్ చేసింది. అంతేకాదు కొత్త సంవత్సరం ఆనందకరమైన విషయంతో మొదలు పెడుతున్నానని పేర్కొంది. నాకు సహకరించిన వారికి రుణపడి ఉంటానని తెలిపింది. కష్టానికి ప్రతిఫలం ఉంటుందని ట్వీట్ లో కాజల్ పేర్కొంది.










Show Full Article
Print Article
More On
Next Story
More Stories