కరోనా క్రైసిస్‌ ఛారిటీకి కాజల్‌ విరాళం

కరోనా క్రైసిస్‌ ఛారిటీకి కాజల్‌ విరాళం
x
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగలపైనా పండింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి, దీనితో రోజు వారీ వేతనాలు చేసుకునే సినీ...

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగలపైనా పండింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి, దీనితో రోజు వారీ వేతనాలు చేసుకునే సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు తెలుగు ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఛారిటీ కి తమ వంతు సాయంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. తాజాగా ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సినీ కార్మికులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సీసీసీకి రూ. 2 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్‌ మేనేజర్‌ గిరిధర్‌ మాట్లాడుతూ.. రూ. 2లక్షలను గురువారం రోజున ఆర్టీజీఎస్‌ ద్వారా సీసీసీకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories