ఘనంగా జయసుధ కుమారుడి వివాహ విందు

ఘనంగా జయసుధ కుమారుడి వివాహ విందు
x
Jayasudha Son Wedding reception (File photo)
Highlights

ప్రముఖ నటి జయసుధ, నితిన్‌ కపూర్‌ దంపతుల పెద్ద కుమారుడు నిహార్‌ వివాహ విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విందుకు కుటుంబ సభ్యులు, అత్యంత...

ప్రముఖ నటి జయసుధ, నితిన్‌ కపూర్‌ దంపతుల పెద్ద కుమారుడు నిహార్‌ వివాహ విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విందుకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొని, సినీ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులైన నిహార్ క‌పూర్, అమ్రిత్ కౌర్‌ లను ఆశీర్వదించారు. ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ కృష్ణ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టి.సుబ్బరామిరెడ్డి, మురళీ మోహన్‌, నరేష్‌ తో పాటు పలువురు హజరయై వధూవరులను శుభాకాంక్షలు తెలిపారు.

జ‌య‌సుధ‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నిహార్ క‌పూర్‌, శ్రియాన్ క‌పూర్‌. వీరిలో నిహార్ క‌పూర్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అమ్రిత్ కౌర్‌ తో ఫిబ్రవ‌రి 26న వివాహం అయింది. నిన్న సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఘనంగా వివాహ విందుని ఏర్పాటు చేశారు. జయసుధ సినిమాలతో పాటు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక అందులో చేరారు. ఇక గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో చనిపోయన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories