గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఇస్మార్ట్ శంకర్

గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఇస్మార్ట్ శంకర్
x
Highlights

ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం తన ఆశలన్నీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...

ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం తన ఆశలన్నీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభ నటేష్, 'మిస్టర్ మజ్ను' ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ కొన్ని అందమైన ప్రదేశాలలో చిత్రబృందం కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించింది. తాజా సమాచారం ప్రకారం గోవాలోని ఈ కీలకమైన షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది.

ఇద్దరు హీరోయిన్లు కూడా గోవా షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయినట్లే. ఈ సందర్భంగా చిత్ర బృందం పార్టీ కూడా చేసుకున్నారు. ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఆ విషయం చిత్ర పోస్టర్స్ ను చూస్తేనే అర్థమైపోతోంది. పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాను మేలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories