అనుష్క బాటలో కీర్తి సురేష్..?

అనుష్క బాటలో కీర్తి సురేష్..?
x
Keerthi Suresh, Anushka Shetty (File Photo)
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో 'నేను శైలజ' చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది కీర్తి సురేష్.

తెలుగు చిత్ర పరిశ్రమలో 'నేను శైలజ' చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది కీర్తి సురేష్. తోలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం జనవరి 1 2016న విడుదలైంది. తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలను చేసింది. తెలుగులో మహానటి తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కీర్తి సురేష్. అలనాటి మహానటి సావిత్రి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'మహానటి'లో కేర్తి సురేష్ ప్రధాన పాత్రా పోషించింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు తన నటనతో నిజంగానే ప్రాణం పోసింది కీర్తి సురేష్. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. ఆ తరువాత కేర్తి సురేష్ కథల ఎంపికలో చాల జాగ్రతలు తీసుకుంది.

మహానటి విజయం తరువాత మళ్ళి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమాను చేసింది. ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ కు సిద్దమైన సినిమా దేశంలో కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ధియేటర్ లు ముసివేయడంతో ఆగిపోయింది. అయితే, ఇటీవలే 'పెంగ్విన్' డిజిటల్ బట పట్టింది. జూన్ 19న అమజాన్ ప్రైమ్ లో అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తరువాత కీర్తి సురేష్ చేతిలో చేతిలో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, వంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. కీర్తి సురేష్ కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపైనే దృష్టి పెడుతుందేమో అని సినీ వర్గాల సందేహం. మహానటి విజయం తరువాత దర్శక నిర్మాతలు సీర్తి సురేష్ డేట్స్ కోసం క్యూ కట్టారు. కనీ.. కీర్తి మాత్రం కథల ఎంపికలో చాల జాగర్తలు తీసుకుంటూ.. మహిళా ప్రాధన్యత కలిగిన సినిమాలను సిద్దం చేసుకుంటుంది.

గతంలో అనుష్క శెట్టి కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి చేశాకే స్టార్డం సాధించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా అనుష్కకి గొప్ప పేరుతో పాటు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత అనుష్క వేదం, పంచాక్షరీ, రీసెంట్ గా భాగమతి సినిమాలతో ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం కూడా అదే కోవలో రాబోతుంది. అదేవిదంగా కీర్తి కుడా అనుష్క బాటలో నడుస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి అని సినీ వర్గాల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నితిన్ హీరోగా రంగ్ దే, మహేష్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' సినిమాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories