Review 2019: తెలుగు తెరపై మెరిసిన కొత్త తారలు!

Review  2019:  తెలుగు తెరపై మెరిసిన కొత్త తారలు!
x
Highlights

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు.

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కొంతమంది భామలు వెండితెరకి పరిచయం అయి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. వారెవరో తెలుసుకుందాం.

శ్రద్దా శ్రీనాథ్:

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ కన్నడ భామ.. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో పాటు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన జోడి సినిమాలో కూడా నటించింది ఈ భామ..

దివ్యాంశ కౌశిక్:

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన మజిలి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ భామ.. కనిపించింది కొద్దిసేపే అయిన ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ భామ. ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోగా వస్తున్న టక్కరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రియాంక అరుళ్ మోహన్:

నాని హీరోగా నటించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ భామ..

శ్రద్దా కపూర్:

బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిన ఈ భామ ప్రభాస్ సాహో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బాలీవుడ్ బ్యూటి

శృతి శర్మ:

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో హీరోయిన్ గా నటించిది శృతి శర్మ.. ఈ సినిమాలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి శిష్యురాలిలా బాగా నటించింది . ఈమె నటనకి గాను మంచి మార్కులే పడ్డాయి.

గార్గేయి యల్లాప్రగడ:

ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ భామ.. మొదటి సినిమాతోనే పాత్రకి స్కోప్ ఉన్న పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాకి ఈమె ప్రధాన ఆకర్షణ కావడం విశేషం.

అనన్య:

కమెడియన్ ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఈ భామ.. ఆమె పాత్ర కి మంచి స్కోప్ ఉండడంతో నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది ఈ భామ

వాణి భోజన్:

హీరో నుంచి నిర్మాతగా మారి విజయ్ దేవరకొండ నిర్మాత మారి తెరకెక్కించిన 'మీకు మాత్రమే చెప్తా' ద్వారా ఎంట్రీ ఇచ్చింది వాని భోజన్.. గ్లామర్ పరంగా పర్వాలేదు అనిపించింది.

నేహా చౌహన్:

విభిన్నమైన కథలు తెరకెక్కించే దర్శకుడు ఈ సంవత్సరం 'ఆవిరి' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ద్వారా నేహా చౌహన్ వెండితెరకి పరిచయమైంది.

సలోని మిశ్రా, హర్షిత గౌర్ :

ఈ ఇద్దరు భామలు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఫలక్ నుమా దాస్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories